నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు బ్రతికేది ఎలా ? 

    అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 8వ రోజు 24వ డివిజన్ లోని నవోదయ కాలనీలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ఈ వైకాపా ప్రభుత్వ హయాంలో పేద,మధ్యతరగతి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లేక పెరుగుతున్న నిత్యావసర వస్తువులను కొనలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గత ప్రభుత్వ హాయంతో పోల్చితే ప్రస్తుత వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని అన్నారు. దీనికి తోడు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం అందిల్చాల్సిన బ్యాల్లు, చక్కర మొదలగు నిత్యవసర వస్తువులను ప్రజలకు అందించకుండా కేవలం బియ్యం మాత్రమే అరకొర ఇస్తున్నారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటూ.. దయచేసి ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీర మహిళలు గురు లక్ష్మి, గాయత్రి, సానియా, అసీద్, సురేఖ, అంజలి, జమున, కాంతమ్మ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way