Search
Close this search box.
Search
Close this search box.

తిరుపతిలో జనసేన సన్నాహక సమావేశంలో పార్టీ నేతలకు సూచన

   తిరుపతి ( జనస్వరం ) : జనసేన పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి లో జనసేన పార్టీ బలంగా ఉందని, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి జనసైనికుడు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. టిడిపి నేతలతో సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జనసైనికుడు పనిచేయాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో తిరుపతిలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. తిరుపతి నగర కమిటీలు,వార్డ్ కమిటీలు ఏర్పాటు చేసాము బూత్ లెవల్ లో కూడా కమిటీలను పటిష్ఠం చేస్తున్నామన్నారు. టిడిపి నేతలతో కలిసి పార్టీ శ్రేణులు ఉమ్మడిగా పార్టీ అధినాయకత్వం సూచించిన కార్యాచరణ అమలయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, తిరుపతి నగర మరియు వార్డ్ ఇంచార్జిలు, జనసైనికులు, వీరామహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way