కొండలపై అక్రమ తవ్వకాలు వెంటనే ఆపేయాలని అతికారి దినేష్ డిమాండ్

అతికారి దినేష్

    రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట మండలం బాలరాజు పల్లె గ్రామంలో ఇసుక రీచులలో రోడ్డుల కోసం ఈ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు అక్రమంగా కొండలు తవ్వుతున్నారని రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ తవ్విన గ్రావెల్ ను ఇసుక రీచుల కోసం రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ ఇసుకను దళారుల చేత అక్రమంగా రవాణా చేయించడం తగదని ఆ విధంగా వైసీపీ పార్టీ నాయకులు అక్రమంగా కొండ తవ్వకాలు అక్రమ ఇసుక రవాణా వంటి చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యకలాపాలు చూస్తూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకోవడం శోచనీయమని అన్నారు. ఒక సామాన్యుడికి ఒక ట్రాక్టర్ గ్రావెల్ కావాలన్నా ఇసుక తీసుకువెళ్లాలన్నా పలు షరతులు విధించి పలు కండిషన్ లు పెట్టే ప్రభుత్వ అధికారులు ఈ వైసీపీ అరాచక శక్తులు చేస్తున్నటువంటి అక్రమాల పైన ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో చట్టాలు బలహీనుడికి బలంగానూ, బలవంతుడికి బలహీనంగాను పని చేస్తున్నాయని ఎద్దేవా చేశారు… దోచుకోవడం, దాచుకోవడమే పరామవధిగా సామాన్యుడిని ఈ వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని తక్షణమే ఈ అక్రమాలను ఆపాలని లేని పక్షంలో రోడ్డులెక్కి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగిలి ఓబులేష్, గుగ్గిళ్ళ నాగార్జున, వెంకటేష్, గోపికృష్ణ, హేమంత్, ఆనంద్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way