యువగళం – నవశకం బహిరంగ సభకు జాతరలా తరలి రావాలి : గురాన అయ్యలు

   విజయనగరం : ( జనస్వరం ) :  జ‌గ‌న్‌రెడ్డి విధ్వంస‌ పాల‌న‌కి చ‌ర‌మ‌గీతం పాడేందుకు విజయనగరం జిల్లా నుంచే సమిష్టిగా సమరశంఖం పూరించాలని జనసేన నేత గురాన అయ్యలు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న యువగళం – నవశకం బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా జనసేన నేతలు, జనసైనికులు, వీర మహిళలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ప్రజానీకాన్ని ఈ బహిరంగ సభకు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ డిసెంబరు 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ప్రారంభవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన, తెలుగుదేశం పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way