అర్హత ఉన్నా అందని ప్రభుత్వ పథకాలు – కళ్ళకి కనిపిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు

ప్రభుత్వ పథకాలు

       జగ్గంపేట ( జనస్వరం ) : జనం కోసం జనసేన 728వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో కనిపించిన హృదయ విదారక దృశ్యం. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో లక్కోజు ఆచారి అనే వ్యక్తి గత యెనిమిది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నా కానీ ఇప్పటి వరకు ఆయనకు అంగవైకల్యం పింఛను రాకపోవడం దురదృష్టకరం. ఆచారి గారు గత యెనిమిది సంవత్సరాలనుండి కూడా మంచం మీది నుండి లేవలేని పరిస్థితిలో ఉండగా వారి కుమారుడు కార్పెంటర్ పని చేసుకుంటూ కనీసం సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో తన తండ్రి బాగోగులు చూసుకుంటూ అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఈయన పరిస్థితిని చూసి కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా దౌర్భాగ్యం. ఈయన పరిస్థితిని నేరుగా చూసి ఒక నెల రోజుల లోగా ఈయనకు పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన వెంటనే నియోజకవర్గవ్యాప్తంగా ఈ విధంగా దయనీయ పరిస్థితిలో ఉండి అర్హులైన వారిని గుర్తించి వారందరికీ తప్పకుండా అండగా నిలబడతామని సూర్యచంద్ర హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way