ప్రజా అభిప్రాయం మేరకు వాటర్ ట్యాంక్ నిర్మించాలి

వాటర్ ట్యాంక్

         విజయనగరం ( జనస్వరం ) : జనసేనపార్టీ గజపతినగరం, బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీ ప్రజలు వాటర్ ట్యాంక్ సమస్యను   నియోజకవర్గ సమన్వయకర్త  మర్రాపు సురేష్  దృష్టికి తీసుకుని వచ్చారు. స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకులు వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు గృహ సముదాయం ఉన్నచోట నిర్మించడానికి స్థానిక అధికార పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వేరే ప్రాంతంలో నిర్మించాలని దీనిపై జనసేన పార్టీ సమన్వయకర్త సురేష్ గారికి ఎస్సీ కాలనీ ప్రజలు వాటర్ ట్యాంక్ సమస్య తెలియజేశారు. ఈరోజు ప్రాంతాన్ని సందర్శించి, నేరుగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలుకి అనుకూలంగా అనువైన ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించాలని, స్థానిక అధికార పార్టీ నాయకులకు, బొండపల్లి ఎమ్మార్వో కి, గ్రామ సెక్రెటరీకి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొండుపల్లి టిడిపి మండల అధ్యక్షులు బండారు బాలాజీ, జనసేన నాయకులు ఆధాడ మోహన్ రావు, బొండపల్లి జనసేన నాయకులు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way