ఆముదాలవలస నియోజకవర్గ జనసేన – టిడిపిల ఆత్మీయ సమావేశం

ఆముదాలవలస

      ఆముదాలవలస ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గ జనసేన మరియు టిడిపి పార్టీలు ఉమ్మడి ఆత్మీయ సమావేశం  పట్టణంలోని ఎస్ ఎస్ ఎం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ తరఫున ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు, టిడిపి పార్టీ తరపున జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహించారు. ఇరు పార్టీల నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో నియోజకవర్గంలో అన్నిచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తూ, వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వ స్థాపన లక్ష్యంగా కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, జనసేన నాయకులు పాత్రుని పాపారావు, జనసేన మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, ఎలకల రమణ, కొత్తకోట నాగేంద్ర, ఎంపీటీసీ అంపిలి విక్రం, టిడిపి నాయకులు తమ్మినేని చంద్రశేఖర్,చిగురుపల్లి రామ్మోహన్, వావిలపల్లి రాంజీ, అంబాల రాంబాబు, సంపత్ రావు మురళి, తమ్మినేని విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

See also  ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లల చదువులకు పవన్ కళ్యాణ్ భరోసా : మంత్రాలయం జనసేన ఇంఛార్జ్ బి. లక్ష్మన్న