పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి జీవితంలో వెలుగులు నింపిన నంద్యాల జనసేన నాయకులు

 నంద్యాల ( జనస్వరం ) : వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలో స్థానిక సరస్వతి నగర్ లో పాలిటెక్నిక్ “EEE” చదువుతున్న సుమంత్ గౌడ్ అనే విద్యార్థికి ఉన్నత చదువుల కోసం జనసేన నాయకులు సుందర్, చందు, సంప్రదించగా వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ విద్యార్థికి “లాప్టాప్” అవసరం తెలుసుకొని సుమారు 30,000 రూపాయల విలువగల లాప్టాప్ ను అందించడం జరిగింది. రాచమడుగు సుందర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కూడా యువత ముందుకు రావాలి చదువుకుంటున్న విద్యార్థులు చైతన్యవంతం కావాలనేదే ఆయన ఆకాంక్ష అని అన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగానే పేద విద్యార్థులకు సహాయం చేయడంలో జనసేన ఎప్పుడు ముందుంటుందని విద్యార్థులు జీవితంలో వెలుగు లో నింపడమే నా ధ్యేయమని అన్నారు. ఏ సమస్య అయినా ఆలోచించుఏమో కానీ ఒక విద్యార్థి ఇబ్బంది పడుతున్నాడు అంటే జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసారు. పాలిటెక్నిక్ విద్యార్ధి సుమంత్ మాట్లాడుతూ నాకు సహాయం అందించిన జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ అన్నలకు ధన్యవాదాలు. వారు అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటానని. అలాగే ఎంతమంది పేద విద్యార్థులకు తనలాగే సహాయ సహకారాలు అందించాలని ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి జనసేన పార్టీని సిద్ధాంతాలను నేను కూడా తూచా తప్పకుండా పాటిస్తానని నా మొదటి ఓటు జనసేనకేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, అభి, చిన్న, రవి, సుబ్బు, ఈశ్వర్, బాబా, సంజీవ రాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way