రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

      అనంతపురం, (జనస్వరం) : అనంతపురం ఉమ్మడి జిల్లా పుట్టపర్తిలో YSR రైతు భరోసా బహిరంగ సభలో మీరు చెపుతున్న మాయ మాటలు అన్ని పచ్చి అబద్ధాలే. రాష్ట్ర రైతులారా ఒక్క మారు ఆలోచన చేయండి? మీ గ్రామంలో ఉన్న RBK కేంద్రాల ద్వారా మీకు ఏమన్నా లబ్ధి చేకూరిందా? రాష్ట్రంలో ఎంతమంది రైతులకు “సున్నా” వడ్డీకి రుణాలు అందించారు ఇంతవరకు? పగటిపూటే నిరంతరంగా 9 గంటలు కరెంటు అందజేస్తున్నారా? రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఇస్తున్న 13,000 రూపాయల్లో.. కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పాడి పరిశ్రమ రైతులు దగ్గర సేకరిస్తున్న పాలకు లీటరుకు పది రూపాయలు రేటు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలకు లీటర్ పాలు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీల ద్వారా ఎంత రేటుకు కొమ్ముతున్నారు? భూ సర్వే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. భూ సర్వే చేసి మా పొలాల్లో సర్వే రాళ్లకు నీ బొమ్మలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ? మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల పత్రాల్లో గాని, పాసు పుస్తకాల్లో నీ బొమ్మలెందుకు జగన్మోహన్ రెడ్డి? మా పత్రాల్లో నీ బొమ్మను చూసే దరిద్రం మాకెందుకు ఇదంతా ప్రజా సొమ్మును దుర్వినియం చేయడం కాదా? రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న సౌకర్యాలు రోగులకు సవ్యంగా అందుతున్నాయా? సూది మందులు, మాత్రలు పూర్తిగా అవసరమైన అన్ని ఇస్తున్నారా? నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి అంటున్నారు రాష్ట్ర ప్రజలారా మీ గ్రామంలో స్కూలుకు వెళ్లి చూడండి ఎంత అభివృద్ధి చేశారో మీకే అర్థమవుతుంది?పుట్టపర్తి సభా వేదికగా జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు, మాయ మాటలు, దొంగ లెక్కచారాలు అని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కేవలం మాయ మూటలు దొంగ లెక్కచారాలు చెప్పి వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా అధికారంలోకి రావాలని తపన తప్ప చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజలకు మంచి చేసింది లేదు, అభివృద్ధి శూన్యం, ప్రజలకు ఉపాధి లేదు, రాష్ట్రం పూర్తిగా అన్ని రంగాల్లో సర్వనాశనం అయిపోయింది. భావితరాల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది. ఇక నిన్ను నమ్మం జగన్ మేము అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way