మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

నష్టపరిహారం

      విజయవాడ ( జనస్వరం ) : విజయవాడ నుండి గుంటూరు బయలుదేరిన బస్సు 12వ నెంబర్ ప్లాట్ఫారం వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో మరణించిన మృతుల కుటుంబ సభ్యులను  జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి భౌతిక దేహాలను పరిశీలించి ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని మరియు బాధిత కుటుంబాలకు అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రమాద జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని, ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబ సభ్యుల కుటుంబంలో ఒక్కరికి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 50 లక్షల రూపాయల నష్టపరిహారం వారి కుటుంబాలకు చెల్లించాలని, గాయపడిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ విజయవాడ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way