చంద్రగిరి నియొజకవర్గం నుంచి జనసేనలోకి భారీగా చేరికలు

చంద్రగిరి

    చంద్రగిరి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ భావజాలానికి, జనసేన సిద్దాంతాలకు ఆకర్షితులైన యువకులు జనసేన పార్టీలో చేరారు. బుధవారం స్థానిక పిఎసి కార్యాలయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లుకు చెందిన యువకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్, రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శులు ఆనంద్, దేవర మనోహర్, కలప రవి, సంయుక్త కార్యదర్శి బీగల అరుణ, నగర ఉపాధ్యక్షులు బాబ్జీ, పార్ధు, లక్ష్మి, కొండా రాజా మోహన్, నగర ప్రధాన కార్యదర్శి, రుద్ర కిషోర్, నగర కారుదర్సులు కిరణ్ కుమార్, రవి, పురుషోత్తం రాయల్, హేమంత్, ఐటీ కో ఆర్డినేటర్ పార్థసారథి, సీనియర్ నాయకులు తోట జయంతి, రాజేష్ ఆచారి, రమేష్, గోపి, వంశీ,తిరుపతి అర్బన్ నాయకులు జనసేన సాయి, తిరుపతి రూరల్ నాయకులు రాంబాబు, మనోజ్ కుమార్, గౌస్ బాషా, వీరామహిళలు మధులత, శిరీష, దుర్గ, చందన, జనసైనికులు మోహిత్, బాలాజీ, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way