దళితులకు ఈ 4 ఏళ్లలో ఏమ్ చేశారో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి

  పాలకొల్లు ( జనస్వరం ) :  దళితుల ఓట్లతో కుర్చీ ఎక్కిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ నాలుగేళ్లలో దళితులకు ఏమ్ చేశారో సమాధానం చెప్పాలి. కార్పొరేషన్ చైర్మన్ లను పెడితే ప్రజలకు ఒరిగిందేమిటి? కనీసం sc కార్పొరేషన్ లోన్లు మీ జెండా పట్టుకున్న కార్యకర్తలకైనా ఇచ్చారా? సబ్సిడీ లోన్లు ఏమయ్యాయి? 27 Sc పధకాలు ఎందుకు తీసేసారు? బాక్ లాగ్ పోస్ట్ ల సంగతేమిటి? M. B. B. S సీట్ల విషయం లో రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన తొలగించారు? Sc లు డాక్టర్లు అవ్వకూడదా? అంబేద్కర్ విదేశీ విద్యాదీవెన ఆ మహానుబావుడు పేరు తీసేసి మీ పేరు పెట్టుకున్నారు మెల్లగా దానికి గండి కొట్టారు sc లు విదేశాలకు వెళ్లి పెద్ద చదువులు చదువుకోకూడదా?
    Sc లను మభ్యపెట్టి sc లకు వినియోగించాల్సిన సొమ్మును మీ సొంత పధకాలకు దారి మల్లించుకునే హక్కు మీకు ఎవరిచ్చారు. మీ పాలనలో దళితులపై హత్యలు ఎందుకు పెరిగాయి? దళితులను చంపిన నిందితులను మీతో పాటు తిప్పుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. ఇన్ని రకాలుగా మా దళిత సమాజాన్ని మోసం చేసి మళ్ళీ ఎలా బస్సు యాత్రలు చేస్తారు. వెంటనే దళితులకు జరుగుతున్న ఈ అన్యాయాలన్నిటిపై సమాధానం చెప్పాలి. Sc నిధులు ఎలా ఖర్చుచేశారు అనేది శ్వేతపత్రం విడుదల చేయాలి అని జనసేన జిల్లా నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way