అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తిలో జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభం

    శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని పట్టణంలోని నాయుడు బిల్డింగ్స్, గోపాలవనం నందు నాలుగు అంతస్తుల భవనంలో అంగరంగ వైభవంగా నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు పార్టీకి వెన్నెముక అయిన 6 మంది జనసైనికుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. జనసైనికుల చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభించడం పార్టీలో వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తున్నట్టు వినుత కోట తెలిపారు. ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేసిన జనసైనికులు వెంకట రమణ యాదవ్,  ముడుసు గణేష్, షేక్ మున్ని,  పెరత్తూరు తులసీ రామ్, మూర్తి గారి గురవయ్య, మారయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం 4 మండలాల నుండి వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

See also  ప్రజాసమస్యలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి