వైసీపీని సాగనంపుదాం – జనసేనను నిలబెడదాం

వైసీపీని

        రాజంపేట ( జనస్వరం ) : ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించి, ప్రజా సంక్షేమం కొనసాగించే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముకరం చాంద్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఓ సమావేశం ఏర్పాటు చేసిన మందిరంలో జనసేన పార్టీ రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ హసన్ భాషా ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో మండలాల నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి జనసేన నాయకులు ఆహ్వానించారు. రాష్ట్ర కార్యదర్శి ముక్రం ఛాన్ గారు మాట్లాడుతూ జనసేన చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాను ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు పఠాన్, ప్రదీప్, షబ్బీర్, రాయచోటి నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు జయరామ్, జనసేన వివిధ మండలాల నాయకులు గేట్ బాబ్జి, కొండా, భారత్, దినేష్, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు రామ శ్రీనివాస్, ఉమ్మడి కడపజిల్లా కార్యక్రమాల సభ్యులు రియాజ్, వీరమహిళలు రెడ్డిరాణి, రూప, జనసైనికులు బాలాజీ, ఖాసిమ్, ఎహెసన్, ఫాహాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way