డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి : జనసేన చంద్రశేఖర్

డ్రైనేజీ

    ఉరవకొండ ( జనస్వరం ) : పట్టణంలోని ఈశ్వరి మాత ఆలయం ముందు విపరీతమైన డ్రైనేజీ సమస్య ఉంది.పక్కనే ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీ నుంచి మురుగునీరు ఈశ్వరి మాత ఆలయం ముందు నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడ ఎటువంటి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీ నీరు మొత్తం రోడ్లపైకి వచ్చి విపరీతమైన దుర్గంధం వెదజచల్లుతుందని జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పక్కనే మహేశ్వరి పాఠశాల కూడా ఉంది. చిన్నపిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డ్రైనేజీ నీటిలో పడే ప్రమాదం ఉందన్నారు.  ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవేంద్ర, రమేష్, మణి, బోగేష్, రూపేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way