చేతివాటం చూపించిన గ్రామ వాలంటీర్

వాలంటీర్

– పెన్షన్ డబ్బులలో 50 వేలను దొంగలించిన వాలంటర్

    పెడ్డకడబురు, జనస్వరం న్యూస్ (అక్టోబర్03): మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలోని సచివాలయం1 లో గాంధీ జయంతి రోజున గ్రామ వాలంటర్ తమ చేతివాటంను చూపించాడు. పింఛన్ పంపిణీ కొరకు, వాలంటీర్లకు ఇవ్వడం కోసం వెల్ఫేర్ అసిస్టెంట్ తెచ్చిన డబ్బులలో 50వేలను కాజేసి ఏమి ఎరగనట్టు ఉన్నాడు. వాలంటీర్లకు పంచడంలో తేడా రావడంతో వెల్ఫేర్ అసిస్టెంట్ ఆరా తీసిన ఏమి ఎరుగనట్టుగా వ్యవహరించాడు. తీరా సమస్యను పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా, సమస్య విషమించడంతో వాలెంటర్ ఒప్పుకొని డబ్బులను తిరిగి ఇచ్చాడు. గ్రామంలోని నాయకులు సమస్యలో చొరవ తీసుకొని స్టేషన్ బయటి రాజీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై మా ప్రతినిధి ఎస్ఐ మహేష్ కుమార్ ను వివరణ కొరగా మా దృష్టికి ఏ సమస్య రాలేదని, ఏ సమస్యపై వచ్చిన సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేసుకుంటామని తెలిపారు. అలాగే దీనిపై మా ప్రతినిధి, ఎంపీడీవో ప్రభాకర్ ను వివరణ కోరగా సమస్య ఇంతవరకు నా దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేపట్టి, వాస్తవం అయితే వాలంటరీ పై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way