కులవివక్షపై అక్షరమే ఆయుధంగా పోరాడిన గొప్పయోధుడు గుర్రం జాషువా

  గుంటూరు ( జనస్వరం ) :  అక్షరమే ఆయుధంగా అంటరానితనంపై, కులవివక్షపై పోరాడిన గొప్ప యోధుడు విశ్వకవి గుఱ్ఱం జాషువా అని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఆధునిక కవులలో అగ్రస్థానం పొందిన గుఱ్ఱం జాషువా జయంతి సందర్భంగా గురువారం నగరంపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి అగ్రకుల అహంకారాలను, సంఘ సంఘర్షణలను గుఱ్ఱం జాషువా ఎదురుకున్నారన్నారు. గుండెల్ని తాకే భావ కవితలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, ఛీత్కారాలు ఎదురుకున్న చోటే సత్కారాలు పొందిన మహోన్నత వ్యక్తి గుఱ్ఱం జాషువా అని నేరేళ్ళ సురేష్ అన్నారు. గబ్బిలం, ఫిరదౌసి, కొత్తలోకం, తాజ్ మహల్ వంటి మహోన్నతమైన గ్రంధాలతో తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందిన విశ్వనరుడు గుఱ్ఱం జాషువా అని జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి కొనియాడారు. గుఱ్ఱం జాషువా అందించిన కవితా స్పూర్తితో సమాజంలో అసమానతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో నగర కమిటీ కార్యదర్శి బండారు రవీంద్ర , రెల్లి యువ నేత సోమి ఉదయ్, 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, బాలాజీ, రేవంత్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way