ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటి కో- ఆర్డినేటర్ల సమావేశం

తూర్పుగోదావరి

    అమలాపురం ( జనస్వరం ) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ఐటీ కో-ఆర్డినేటర్ తామేష్ గాలిదేవర ఆధ్వర్యంలో, జనసేన స్టేట్ ఐటి కో-ఆర్డినేటర్ పెన్నమరెడ్డి నాగబాబు ముఖ్య అతిధిగా శనివారం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన స్టేట్ ఐటి కో-ఆర్డినేటర్ నాగబాబు పెన్నమరెడ్డి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలలో ఐటి టీం ను మరింత బలపరచాలని, ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఓటరు రిజిస్ట్రేషన్ పైలట్ ప్రాజెక్టు ను తొలుత పి.గన్నవరం నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైలట్ ప్రాజెక్టు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని దానిని మరింత ముందుకు తీసుకెళ్ళేలా ఆదేశాలిచ్చారని తెలిపారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ఐటీ కో-ఆర్డినేటర్ తామేశ్ గాలిదేవర మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాద్యతగా పనిచేయాలని త్వరలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో జిల్లా ఐటి కార్యకర్తలతో భారీ సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాల ఐటీ కో-ఆర్డినేటర్లు మరియు మండల కో-అర్డినేటర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way