దీక్షకు పెరుగుతున్న మద్దతు – క్షీణిస్తున్న లక్ష్మీ ఆరోగ్యం – పట్టించుకోని ప్రభుత్వం

లక్ష్మీ

        సత్తెనపల్లి ( జనస్వరం ) : నకరికల్లు గ్రామం మెయిన్ రోడ్డు వద్దనున్న హుస్సేన్ హాస్పిటల్ నుండి పాతూరు మసీదు వరకు రోడ్డు వేస్తానని చేసిన ఎన్నికల హామీలో భాగంగా మరియు “గడప గడపకి మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఇచ్చిన వాగ్ధానంలో భాగంగా స్థానిక MLA మరియు రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఇచ్చారు. మాట తప్పినందుకు, మడెమ తిప్పినందుకు నిరసన తెలియజేస్తూ జనసేన వీరమహిళ నిరాహార దీక్ష చేస్తోంది. గత 2 రోజులుగా కనీసం మంచినీరు కూడా తాగకుండా కఠినంగా దీక్ష చేస్తోంది. సదరు రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టేవరకు లేదా ఆ మేరకు ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు లక్ష్మీ ఆమరణ దీక్ష విరమించే ప్రసక్తే లేదని చెప్తోంది. గంట గంటకి ఆమె ఆరోగ్యం క్షీనిస్తోంది.  ఇప్పటికే గురజాల, వినుకొండ జనసేన నాయకులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ పోరాటంలో లక్ష్మీకి జిల్లా వ్యాప్తంగా మద్దతు పెరుగుతూ ఉంది. రేపు రాష్ట్ర స్థాయి నేతలు రానున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో లక్ష్మీకి ఏమైనా జరిగితే అంబటి రాంబాబు పూర్తి భాద్యత వహించవలసి ఉంటుందని జనసేన నాయకులు హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way