దివ్యాంగురాలకి వీల్ చైర్ అందజేసిన కందుల నాగరాజు

కందుల నాగరాజు

        విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో దివ్యాంగురాలు సబ్బవరపు లక్ష్మికి డాక్టర్ కందుల నాగరాజు వీల్ చైర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, వాళ్ళ కష్టాలను నేరుగా వినేందుకు తాను నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. రాజకీయ నాయకులు అనే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా అవసరమైన వారికి సహాయం చేసేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. తను చేస్తున్న కార్యక్రమాలకు జనసేన నాయకులు, వీర మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. తన సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నరేంద్ర, రాజు, త్రినాధ్, ప్రసాద్, రాజు, p. రాజు, వై.ప్రసాద్, అప్పారావు, మణి, శేఖర్, గాజుల శ్రీను, పవన్, సురేష్, రూప, వర, శ్రీదేవి, పద్మ, సునీత, అరుణ, కోమలి, పుష్ప, సంధ్య, కుమారి, నళిని దేవి, జనసేన యువనాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way