Search
Close this search box.
Search
Close this search box.

పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి శూన్యం : రామా శ్రీనివాస్

రామా శ్రీనివాస్

         రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గం లోని సుండుపల్లి మండలంలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పాదయాత్ర పెద్దబలిజపల్లి నుండి సుండుపల్లి తాసిల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్లమెంటు ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి ముకరం చాంద్ తదితరులు పాల్గొన్నారు. రాజంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా అభివృద్ధికి దూరమైందని విమర్శించారు. అన్నమయ్య డ్యాం,పింఛ ప్రాజెక్టులు తెగిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. సుండుపల్లి మండలంలో సిమెంట్ రోడ్డు లేక ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు. రానున్న 2024 ఎన్నికల్లో జనసేన పార్టీనీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి నందలూరు మండల మాజీ జడ్పీటీసీ శివరామరాజు, దళిత నాయకులు పల్లం నాగేంద్ర, ఎమ్మార్పీఎస్ నాయకులు మహదేవ తదితరులు సంఘీభావం తెలిపారు. సుండుపల్లి తాసిల్దార్ కార్యాలయంలో సర్వే రక్షిత కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు రెడ్డి రాణి, మండల అధ్యక్షుడు ఓబులేసు, వంటేరు రాజా, మచ్చ లక్ష్మీనారాయణ, మడితాడు సలీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way