ఆమంచి స్వాములకు ఘన స్వాగతం పలికిన సర్వేపల్లి నాయకులు

   సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో కలిసి బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆమంచి స్వాములు గారికి శాలువతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపునాడు అధ్యక్షుడిగా ఎన్నో సేవలందించి ఒక మంచి వ్యక్తిగా పేరుపొందిన ఆమంచి స్వాములు వైసిపి పార్టీలో ఉంది అక్కడ సిద్ధాంతాలు నచ్చక రాష్ట్రం అభివృద్ధి లేకపోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చూస్తూ ఉండలేక మార్పు కోసం వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయనతో ఆయనకున్న మంచి సంబంధాలు, అదేవిధంగా రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో ఇటీవల చేరడం జరిగింది. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి చీరాల నియోజకవర్గ నాయకులు, కాపు ఉద్యమ నేత ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి రావడంతో ఆమంచి శ్రీరాములు గారిని మర్యాదపూర్వకలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, సందీప్, వంశి, సాయి, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way