బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన రాజంపేట జనసేన నాయకులు అతికారు దినేష్

      రాజంపేట, (జనస్వరం) : తిరుపతి కడప హైవేలో నిన్న జరిగిన లారీ, బస్సు రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను రాజంపేట జనసేనపార్టీ నాయకులు అతికారి దినేష్  పరామర్శించి పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు, పౌష్టికాహారం, కిట్లను అందజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన రాజంపేట నియోజకవర్గ జనసైనికుడు ఏనుగుల మల్లి తండ్రి గారైన ఏనుగుల శంకరయ్య తీవ్రంగా గాయపడడంతో అతని కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అలాగే సిద్దవటం మండలానికి చెందిన బస్సు కండక్టర్ బాల వెంకటేష్ కూడా తీవ్రంగా గాయపడి ఐసియులో ఉన్నారు. అతని కుటుంబ సభ్యులకి కూడా 10,000/- రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా కాపునాడు అధ్యక్షులు సింగనమల శ్రీనివాసులు, హేమంత్, అండ్రు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way