లోక౦ మాధవి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం

ఇంటింటికి జనసేన

           నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం, పూతిక పేట గ్రామంలో జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇంచార్జ్  లోక౦ మాధవి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పూతిక పేట గ్రామస్తులు శ్రీమతి మాధవి గారిని జన నీరాజనాలతో స్వాగతించారు. మాధవి గారు గడపగడపకు తిరుగుతూ గతంలో రెండు ప్రభుత్వాలకి మద్దతు తెలియజేసారని, ఇప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని, ప్రజల బతుకుల్లో మార్పు రావాలంటే, పారిశ్రామికం గా ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని తెలియజేసారు. గ్రామ ప్రజలు వారి సమస్యలను లోకం మాధవి గారికి వివరిస్తూ ఆ గ్రామంలో ఉన్న SC కాలనీల్లో ఎన్నో నెలల నుండి కాలువల్లో చెత్త పేరుకుని పోయిందని, అలాగే బోరింగ్ సమస్య, మరియు పారిశుద్ధ్యం మాధవి గారు దృష్టి తీసుకొని వచ్చారు. మాధవి గారు మాట్లాడుతూ ఆ సమస్యలను పరీక్షించి తాను అధికారంలో లేకపోయినా ఆ సమస్యను తీరుస్తానని మాధవి గారు మాటిచ్చారు. అలాగే ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని వైసీపీకి అనుకూలంగా లేకపోతే వారి ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని, వాటిని తిప్పికొట్టేలా ప్రజలందరూ అంత సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మండలం నాయకులు కురుమజ్జి గోవింద్, పతివాడ శ్రీనివాసరావు, పతివాడ సువర్ణ, శీల ప్రసాద్, యడ్ల పండు, శీర శ్రీనివాసరావు,యడ్ల వెంకటేష్, కొత్తూరు శ్రీనివాసరావు మరియు జనసేన కార్యకర్తలు వీర మహిళలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way