వాలంటరీ వ్యవస్థను ఉద్దేశించి మాట్లాడిన మాటలను తప్పుగా దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ

వాలంటరీ

          టెక్కలి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థను ఉద్దేశించి మాట్లాడిన మాటలను తప్పుగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు గ్రామ వాలంటరీని రెచ్చగొట్టి చేస్తున్న ప్రచారం చేస్తున్నారని టెక్కలి జనసైనికులు అన్నారు. దాని వ్యతిరేకిస్తూ టెక్కలి నియోజకవర్గ నాయకులు కోటేశ్వరరావు పల్లి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు ( కోటేశ్వరరావు ) మాట్లాడుతూ అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా అవినీతే లక్ష్యంగా నైపుణ్యం కలిగిన లక్షలాదిమంది యువతను కేవలం 5000 రూపాయలు ఇచ్చి, వెట్టి చాకిరీ చేయిస్తు,యువతను వైసీపీ కార్యకర్తలుగా మార్చే ప్రయత్నము చేస్తున్నారు. యువతను నిరుద్యోగులుగా మార్చుతున్నారు. ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు,అభివృద్ధి లేదు.ఇలా ఏ ఒక్క సిద్ధాంతాలపైన మాట్లాడ లేని వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగడం, యువతను ప్రక్క తోవ పట్టిస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం యువతకు భేసరతు గా క్షమాపణ చెప్పాలి అని అన్నారు. అనతరం #HelloAP_ByeByeYCP #HelloAP_Welcom_JSP నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు జనార్దన్, ప్రసాద్, వినోద్,చందు,భాస్కర్, చిరంజీవి సందీప్,పవన్ ధనరాజ్ జనసైనికులు తేజ, సందీప్ పాల్గొన్నారు. 

See also  ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ : విజయవాడ పశ్చిమ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి