పాలాభిషేకం చేస్తే అరెస్టులా ? : ధనుంజయ్

పాలాభిషేకం

       పామిడి ( జనస్వరం ) : జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే అడ్డుపడని పోలీసులు మా నాయకుడిని ప్రజల మధ్యన కించపరుస్తూ మాట్లాడుతుంటే అడ్డు చెప్పని పోలీసు వ్యవస్థ. మా నాయకుడిని అగౌరపరుస్తుంటే ఆ బాధను భరించక మా అధ్యక్షుల వారికి పాలాభిషేకం చేద్దామంటే కూడా పోలీసు వారి నిర్బంధం చేయడం ఏంటని మండల అధ్యక్షులు ధనుంజయ్ ధ్వజమెత్తారు. పాపం పోలీసు వారు కూడా పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ఇలా ప్రతి చోట మమ్ములను అడ్డుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. పాలాభిషేకం చేయడమే నేటి సమాజంలో నేరం అన్నట్టు అరెస్టులు చేస్తున్నారు.. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటి అన్నిటిని ఖండించి అధికారంలోకి వచ్చాక అంతకుమించి అధికార బలాన్ని ఉపయోగించి అణిచివేయాలని చూస్తున్నారు. ఇది ఎల్లకాలం సాగదని ఇక కొద్ది రోజుల్లో ప్రభుత్వాలు మారిపోతున్నాయని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way