Search
Close this search box.
Search
Close this search box.

ప్రజలందరూ హలో ఏపీ బై బై వైసీపీ అంటున్నారు

వైసీపీ

    నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 311వ రోజున 9వ డివిజన్ నవాబుపేట రామకృష్ణనగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హలో ఏపీ బై బై వైసీపీ నినాదం రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతోందని, వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో ఊపిరాడక విసిగి వేసారి పోయిన ప్రజలందరికీ ఆ నినాదం ప్రాణవాయువులా పనిచేస్తోందని అన్నారు. తాము నియోజకవర్గంలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలందరూ అపూర్వంగా ఆదరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలిచేది తామేనని, ఇందులో ఎటువంటి సందేహాలు లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీస అభివృద్ధి కూడా లేని నెల్లూరు నగరాన్ని పవనన్న ప్రభుత్వంలో సమగ్ర అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way