Search
Close this search box.
Search
Close this search box.

బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా? లేక వైసీపీ కార్యకర్తలకే ఎమ్మెల్యేవా?

బొబ్బిలి

      బొబ్బిలి ( జనస్వరం ) : తెర్లాం మండలం నందిగాం గ్రామంలో నిన్న స్థానిక MLA శంబంగి చినప్పలనాయుడు గడప గడపకు వైసిపి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా, తెర్లాం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మరడాన రవి ప్రభుత్వ పథకాలు మరియు ఉద్యోగాల విషయంలో MLA వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించగా ఏ పథకాలైనా, ఉద్యోగాలైనా మా పార్టీ వారికి ఇచ్చుకుంటాం కాని మిగతా వాళ్ల సంగతి మాకెందుకంటూ అప్రజాస్వామికంగా మాట్లాడటాన్ని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి  బాబు పాలూరు గారు తీవ్రంగా ఖండించారు. ఓవైపు CM జగన్ నగరానికో సొంత ప్యాలెస్ లు, కోట్లలో వ్యాపారాలు, తన చుట్టూ పెత్తందార్లను పెట్టుకుని భయటకు మాత్రం పేదలకు పెత్తందార్లుకు యుద్ధం అంటూ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఇంకో వైపు తన MLAలు మా కుటుంబీకులు, మా పార్టీ మనుషులుకే పథకాలు, ఉద్యోగాలు ఇచ్చుకుంటాం మా ఇష్టం అంటూ బరితెగించి బహిరంగంగానే చెప్తుండుడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ బాబు పాలూరు గారు ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక భాషని మరోసారి పునరావృతం చేస్తే, ప్రజల తరపున జనసేన పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, వీర మహిళ యందువ యామిని, బొబ్బిలి నాయకులు పల్లెం రాజా, రామకృష్ణ నాయుడు, ఉమ, సత్య, శివ శంకర్, చీమల సతీష్, రాజు, సాయి తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way