లుంబూరు గ్రామ ప్రధాన సమస్యలపై MPDO కి వినతి పత్రం

లుంబూరు

     పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ మండలం స్థానిక పాలకొండ లుంబూరు మధ్య గల రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఎంపిడిఓ డొంక త్రినాధులకు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. లుంబూరూ గ్రామంలో BC కాలనీలో రోడ్డు లేదని, కలువాలు లేకపోవడం వల్ల, నీరు నిల్వలు అధికంగా ఉండడం వలన, దోమలు వ్యాపించడం జరుగుతోందన్నారు. అక్కడ నివసించే ప్రజలు దోమకాటుకు గురై, డెంగ్యూ, మలేరియా వంటి, వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తుండటంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని గర్భాన సత్తిబాబు తెలియపరిచారు. వివరణ అనంతరం ఎంపీడీవో గారు స్పందించి, తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామని, లుంబూరు బీసీ కాలనీ CC రోడ్డు కి నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర, డొంపాక సాయి కుమార్, మాదసి సంతోష్ కుమార్, రమేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way