శ్రీకాళహస్తిలో వినుతా కోటా ఆధ్వర్యంలో KNOW MY CONSTITUENCY కార్యక్రమం

వినుతా కోటా

     శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 48 వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమం లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా  శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని వీధుల్లో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి ,జనసేన పార్టీ కి ఒక్క అవకాశం కల్పించాలని ప్రజలను కోరడం జరిగింది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నియోజకవర్గంలో, రాష్ట్రంలో జనసేన పార్టీ ముందుండి పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలలో ఏ మాత్రం మెరుగు లేదని ప్రజలు తెలియజేశారు. సమస్య ఉంది అని చెప్పడానికి కూడా ఏ కేసులు పెడతారో అని భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోయారు. అన్ని రేట్లు పెంచి , సంక్షేమం పేరుతో కొద్ది మందికి మాత్రమే మేలు చేసే కార్యక్రమాలు మాత్రమే ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఏ మాత్రం అభివృద్ది లేదని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు వెంకటరమణ , నితీష్ కుమార్ , జనసైనికులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way