జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు మద్దతుగా జనసేన

జనసేన

      నిర్మల్ ( జనస్వరం ) : భైంసా, జూనియర్‌, ఔట్‌సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌చేసే జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రకమిటీ పిలుపుమేరకు శనివారం రెండవ రోజు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట డివిజన్ పరిధిలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ సమయం పూర్తైనా ప్రభుత్వం రెగ్యులర్‌ చేయడంలో కాలయాపన చేస్తోందన్నారు. వెంటనే రెగ్యులర్‌ చేస్తూ జీవోను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరవధిక సమ్మె కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ఈ సమ్మెలో ఔట్‌సోర్సింగ్‌, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way