అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జనసేన నాయకులు

     నెల్లూరు, (జనస్వరం) : కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వినాయక కాలనిలో కొద్దిరోజుల క్రితం అగ్నిప్రమాదం కారణంగా ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గిరిజన కుటుంబాలకు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్, జనసైనికులతో కలసి నిత్యావసర సరుకులు,బియ్యం బస్తాలు అందజేశారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్  మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు ఇప్పటికి ఆధార్ కార్డులు లేకపోవడంతో, అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందకపోవడం బాధాకరం అన్నారు. కానీ కొందరికి మాత్రం ఓటర్ కార్డులు ఉన్నాయని, ఓట్లు కోసమే గిరిజనులను ఉపయోగించుకుంటూ, ప్రభుత్వ పథకాలు అందించకపోవడం దారుణమని, అధికారులు స్పందించి గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుని గిరిజనులకు పక్కా ఇల్లు కట్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్, కార్యదర్శి ప్రశాంత్, మౌనేష్, హేమచంద్ర యాదవ్, ప్రసన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way