సాక్షి దినపత్రిక వార్తల్లో వ్యక్తికి – జనసేన పార్టీకి సంబంధం లేదు

     ఆముదాలవలస ( జనస్వరం ) : గత కొన్ని రోజులుగా పొందూరు మండలం, బురిడి కంచరాం గ్రామానికి చెందిన గులివెందుల అసిరి నాయుడు పై వస్తున్న ఆరోపణలలో భాగంగా, ఆయన జనసేన పార్టీ నాయకుడని , పొందూరు మండల జనసేన నాయకుడని వస్తున్న వార్తలను నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు గారు తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీని మండలంలో ఎదగకుండా చేయడానికి ఇది ఒక రాజకీయ ఎత్తుగడని ఆయన విమర్శించారు. ఆయనకు, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మండల అధ్యక్షులు యలకల రమణ గారు పత్రికా ప్రకటనలో తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన వ్యక్తిగత సమస్యలు కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని , ఆయన కనీసం మా పార్టీలో క్రియాశీలక సభ్యులు కూడా కారని ఈ ప్రకటనలో తెలిపారు. ఇటీవల సాక్షి పత్రికలో వేసిన వార్తలో “జనసేన నాయకుడు కిరాణా వ్యాపారి బలి” అని ప్రచురించారు. దయచేసి ఈ వార్తను సవరించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మండల నాయకులు కొంచాడ చిన్నమనాయుడు, పొన్నాడ బాలకృష్ణ, కోంచాడ సూర్య, గార బాబూ రావు, వసంత్ కుమార్, గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way