విద్యుత్ వినియోగదారులపై పెంచిన ట్రూ అప్ చార్జీలను వెంటనే తగ్గించాలి

విద్యుత్

       రాజంపేట ( జనస్వరం ) : కరెంటు చార్జీలు పెంచుతూ, అసలే వేసవి కాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది అటువంటి సమయంలో విద్యుత్ చార్జీలను పెంచడం వలన వైసీపీ ప్రభుత్వం ప్రజల పైన మోయలేని పెనుబారం మోపుతున్నారని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గం నాయకులు అతికారి దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ గారు తన పాదయాత్ర సమయంలో కరెంటు చార్జీలు బాదుడే బాదుడు అని నాటకాలు ఆడి తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని ప్రతి ఊరు తిరిగి చెప్పిన జగన్ మాట తప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 6వ సారీ మళ్ళీ విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఒక రూపాయి ప్రజలకు ఇచ్చి పది రూపాయలు ప్రజల పైన పన్నుల భారం వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తీరు వలన నిత్యవసరలన్నీ పెరిగిపోయాయి సామాన్య ప్రజలు బ్రతుకు భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ కనుమరుగయ్యేలా ప్రజలు తీర్పిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way