నెల్లూరు ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజక వర్గం పొదలకూరు మండలంలో మహిళపై వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తూ ఆత్మహత్యా ప్రయత్నం చేసి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కోలుకుంటున్న బాధితురాలిని జనసేన జిల్లా ప్రధన కార్యదర్శి గునుకుల కిషోర్ పరామర్శించారు. మంత్రి గారి నియోజక వర్గం చాటగుట్ల లో వారి నాయకులు జరిపిన ఈ దాడి సభ్య సమాజం సిగ్గపడేలా వుందన్నారు. సర్పంచి తన వాడే అని అహంకారం తో వ్యవహరించిన పెంచలయ్య కు శిక్ష పడే వరకూ బాధితులకు జనసేన తరపున తోడుగా వుంటాం. పేదల పట్ల కనికరం లేకుండా దాడి చేయటం అమానవీయం, ఒంటరి మహిళల పై ఈ విధంగా దాడి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ₹10000 ల అప్పు తిరిగి ఇవ్వక పోతే ఇలా కొట్టమని చెప్పిందా మీ వై సీ పీ అధిష్టానం. అది కూడా అక్క బాకీ వుంటే చెల్లి పై దాడి చేశారు. ఏమి చేసినా చెల్లుతుందా మీ నాయకులకు అనాగరికంగా పేద మహిళల పై దాడి చేసిన వారిని కటినంగా శిక్షించాలి. అధికార మధం తో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు ఈ సారి సరైన బుధ్ధి చెప్పండి. అన్ని వర్గాల అభివృద్ధి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమం లో కిషోర్ తో లక్ష్మన్, బలచంద్ర, రాజేష్, శ్రీను, ప్రతాప్,సాయి దీపక్,ప్రశాంత్ గౌడ్, మౌనేష్, వర, బన్నీ తదితరులు పాల్గొన్నారు.