Search
Close this search box.
Search
Close this search box.

నెల్లిమర్ల నియోజకవర్గంలోని లోకం మాధవి గారి ఆధ్వర్యంలో అట్టహాసంగా సాగిన ఎంసెట్ రిజిస్టేషన్స్ ప్రక్రియ

నెల్లిమర్ల

        నెల్లిమర్ల ( జనస్వరం ) : యువభరోసా కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గ యువతను ప్రోత్సహిస్తూ ఇంటర్మీడియట్ పూర్తయిన పేద విద్యార్థిని, విద్యార్థులకు అండగా జనసేన పార్టీ తరపున నియోజకవర్గ నాయకురాలు లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ప్రవేశ రుసుము మరియు శిక్షణా కార్యక్రమం ఇవ్వదలచుకున్నారు. అందులో భాగంగా ఆదివారం నాడు నెల్లిమర్ల నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎంసెట్ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి మండలంలో ఒక స్టాల్ ని పెట్టి ఆ మండలం కి చెందిన విద్యార్థిని, విద్యార్థులకు ఎంసెట్ రిజిస్ట్రేషన్ తో పాటు ప్రవేశ రుసుము చెల్లించారు. ఈ కార్యక్రమానికి నెల్లిమర్ల నియోజకవర్గం నలుమూలల నుండి అశేష స్పందన లభించింది. నియోజకవర్గానికి చెందిన ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎంతో మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చేసి ఆపేస్తున్నారని, దీనికి ముఖ్య కారణం వారికి అవగాహన కల్పించేవారు లేకపోవడమే అని, మన ఊరిలో జనవాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరిలో ప్రజా సమస్యలుతెలుసుకుంటున్నప్పుడు సాధారణంగా వినిపిస్తున్న సమస్య తమ పిల్లలు 10 లేదా ఇంటర్మీడియట్ తో చదువుని ఆపేసుకొని ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నారని అన్నారు. కొంతమంది పిల్లలు ఇంజనీరింగ్ చేయాలని నిశ్చయించుకున్న వారికి దిశా నిర్దేశం చేసే వారు లేరని పలువురు తల్లిదండ్రులు తన దగ్గర వాపోయారని మాధవి గారు తెలిపారు. దీనిని అధిగమించి ఎంతోమంది విద్యార్థులను ఇంజనీరింగ్ వైపు నడిపిద్దాం అనే భాగంలోనే యువ భరోసా అనే కార్యక్రమం తాము మొదలుపెట్టినట్టు లోకం మాధవి గారు తెలిపారు, అందులో భాగంగానే పేద విద్యార్థిని విద్యార్థులకు EAMCET ప్రవేశ రుసుము మరియు కోచింగ్ ఉచితంగా ఇవ్వదలుచుకున్నామని దీనివలన వారు ఇంజనీరింగ్ చేసి వారి బంగారు భవిష్యత్తుకి నాంది పలుకుతారని ఆశిస్తున్నామని లోకం మాధవి గారు తెలియజేశారు. నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఈ EAMCET రిజిస్ట్రేషన్స్ నమోదు అవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way