అగ్ని బాధితులను పరామర్శించి, సహాయం అందజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

జనసైనికులు

       గుడివాడ ( జనస్వరం ) :  గుడివాడ మండల న్యూజెల్ల గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల షేక్ మస్తాన్ బి ఈల్లు పూర్తిగా కాలిపోవడంతో వారిని పరామర్శించి వారికి బియ్యం నిత్యవసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు.ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు భాగంగా ఈరోజు గుడివాడ మండల నూజిల్లా గ్రామంలో అగ్ని బాధితులను పరామర్శించి వారికి మా వంతు సహాయంగా బియ్యం నిచ్చోస్తుల సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించి వారికి మేము ఉన్నామని భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుడివాడ పట్నంలో అనేక సేవా సంస్థలు వారు ఉన్నారని వారు కూడా స్పందించి ఆదుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటివరకు ఏ ప్రభుత్వ అధికారులు మరియు అధికారపక్ష నాయకులు పరామర్శించకపోవడం చాలా దారుణం అని ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసినప్పుడే ఆ మానవత్వం నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, చరణ్, చరణ్ తేజ, సురేష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way