Search
Close this search box.
Search
Close this search box.

మత్స్యకారులకి వెంటనే పక్కా గృహాలు కట్టించాలని డిమాండ్ చేసిన లోకం మాధవి

లోకం మాధవి

    నెల్లిమర్ల ( జనస్వరం ) : భోగాపురం మండలంలోని ముక్కాం గ్రామంలో  అగ్ని ప్రమాదం సంభవించింది. ముక్కాంలో అధికంగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తుంటారు. వీరిలో ఎక్కువ మందికి పూరి గుడిసెలు ఉండటం గవనార్హం, ఉదయం ఓ పూరి గుడిసె తగలబడుతుండటం చూసిన జనసైనికులు వెంటనే స్పందించి ఆ మంటలను ఆర్పడం జరిగింది. దీనిలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు లోకం మాధవి గారు ఆ ప్రదేశానికి విచ్చేసి బాధితులని పరామర్శించారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 2019 ఎలక్షన్ల నాడు మత్స్యకార కుటుంబాలకి పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే తుంగలోకి తొక్కేసారని మండిపడ్డారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఎన్నో అగ్నిప్రమాదాలు సంభవించాయని, వాటిని నిర్మూలించేలా నియోజకవర్గ నాయకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కనీసం అగ్నిమాపక సిబ్బంది వారు కూడా స్పందించటం లేదు అని తెలిపారు. మత్స్యకారులు ఎంతో కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్ముని వారి గుడిసెల్లో పొందుపరచుకుంటే ఇలాంటి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కష్టార్జితం మొత్తం అగ్గిపాలవటం చాలా బాధాకరమైన విషయం అని తెలియజేశారు. ఈ సమస్య పైన తమ వైపు నుండి భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని ఈ అగ్ని ప్రమాదాలు నిలువరించేలా, మత్స్యకారులకి పక్కా ఇల్లు కట్టేలా తమ పోరాటం ఉంటుందని లోకం మాధవి గారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way