మహిళా సాధికారత కోసం జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది : లోకం మాధవి

లోకం మాధవి

        నెల్లిమర్ల ( జనస్వరం ) : పూసపాటిరేగ మండలంలోని పేరాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న మహిళల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడిన లోకం మాధవి. ఆమె మాట్లాడుతూ మిగతా పార్టీలలా జనసేన పార్టీ హామీలు ఇచ్చి పబ్బం గడిపే పార్టీ కాదు అని ఇచ్చిన హామీని కచ్చితంగా అమలుచేసి తీరుతుందన్నారు. ఈ రోజు ప్రజలు అంటే ఎంతో గౌరవం మరియు నిబద్దత కలిగి ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అని, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వ స్థాపకి కృషి చేయాలి అని అక్కడ ఉన్న ప్రజలను లోకం మాధవి  కోరారు. అలాగే జనసేన మేనిఫెస్టో లో మహిళల కోసం వారి అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలని వారికి తెలిపారు. వారి ఊరి సమస్యలు అడుగుతుండగా అక్కడ ఉన్న మహిళ తను వితంతువు అయినా ఇప్పటికి తనకి పెన్షన్ రాలేదని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగిన ఉపయోగం లేకుండా పోయింది అని వాపోయారు. సమస్య విన్న మాధవి గారు ఆమె తరపున పోరాటం చేస్తాం అని భరోసా కల్పించారు. రాజకీయాలలోకి రావటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలు మరియు ప్రజలకి ఈ ప్రాంతానికి మంచి చేయాలి అన్న తపనే నని ఈ సారి వచ్చే ఎన్నికల్లో జనసేన కి మద్దతు తెలియజేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way