వైసీపీ ప్రభుత్వంలో మధ్య తరగతి కుటుంబాలు చిన్నాభిన్నం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 304వ రోజున 9వ డివిజన్ బంగ్లా తోటలోని జాఫర్ సాహెబ్ కాలువ కట్ట ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా తమ వంతు పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా జీవిస్తున్నారని, ఏ ఇంటిని కదిలించినా ఇంటికో సమస్య చెబుతున్నారని అన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులను రేషనలైజేషన్ పేరుతో అడ్డగోలు నిబంధనలు పెట్టి తొలగించడంతో సంక్షేమ పథకాలకు దూరమైన కుటుంబాలు అధికంగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో ఉన్నత చదువులు చదివించేందుకు ఆస్తులు తాకట్టు పెడుతున్న కుటుంబాలు కనిపించాయన్నారు. సొంత ఇంటి ఉన్న వారికి నెల బాడుగల్లాగా ప్రభుత్వ అడ్డగోలు పన్నులు మారాయని, ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ విధానాలపై సంతృప్తిగా లేరని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, పవనన్న వస్తేనే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయనే ఆకాంక్ష ప్రజల్లో ఉందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way