ప్రజల మధ్యనే ఉగాది పండుగ : పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 302వ రోజున ఉగాది పండుగ రోజున 9వ డివిజన్ బంగ్లా తోట ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా తమ వంతు పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో కలిసి ఉగాది పండుగ జరుపుకుంటూ ఉగాది పచ్చడిని ఆస్వాదించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇది నాలుగో ఉగాది పండుగ అని, మొదటి ఉగాది నాటికే పేదలందరికీ సొంత ఇళ్ళు ఇస్తామన్న ప్రభుత్వం నాలుగో ఉగాదికి కూడా ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు. వచ్చే ఉగాదికి ఈ దగాకోరు ప్రభుత్వం ఉండదని, నవ నూతన ఉత్తేజంతో పవనన్న ప్రభుత్వం ఏర్పాటవుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తాము ప్రజలకు వివరిస్తుంటే, ప్రజలు మరింతగా తమకు వివరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురుచూస్తున్నారని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way