Search
Close this search box.
Search
Close this search box.

చిందేపల్లి గ్రామస్థులతో కలిసి ఆర్.డి.ఓ గారికి జనసేనపార్టీ తరుపున వినతి అందించిన వినుతా కోట

వినుతా కోట

       శ్రీకాళహస్తి ( జనస్వరం ) :  చిందేపల్లి గ్రామానికి వెళ్తున్న ప్రధాన రహదారి పై LANCO/ ECL ఫ్యాక్టరీ వాళ్ళు అడ్డుగా గోడ కట్టడాన్ని నిరసిస్తూ రోడ్డు పై అక్రమంగా అడ్డు గోడ కట్టడాన్ని వెంటనే తొలగించాలని గ్రామస్థులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ G.O. 22/2016 ద్వారా R&B పరిధి లోకి తీసుకున్న రోడ్డు ను ఏ విధంగా మూసి వేస్తారని ప్రశ్నించారు. కాలువ పరుంబోకు లో ప్రత్యామ్నాయ రోడ్డు కల్పించమని G2/1295/2022 ద్వారా కలెక్టర్ గారు ఏవిధంగా ఉత్తర్వులు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలకి ఇబ్బంది కల్గించి ఫ్యాక్టరీ యాజమాన్యం వందల మంది పోలీస్ లను ఉపయోగించి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తక్షణమే రోడ్డు పై ఉన్న అడ్డు గోడను తొలగించాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని, చట్టపరంగా హై కోర్ట్ ను ఆశ్రయించి రెవెన్యూ అధికారులు , పోలీస్ అధికారుల పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డుకి అడ్డుగా గోడ కట్టమని ఎలాంటి ఉత్తర్వులు రెవెన్యూ అధికారుల నుండి ఫ్యాక్టరీ యాజమాన్యం కి ఇవ్వలేదని ఆర్.డి.ఓ. గారు తెలిపారు. సమస్య ను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి రోడ్డు పై అక్రమ గోడ ను తొలగిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way