జాబ్ క్యాలండర్ ఎంత అబద్ధమో 13 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా అంతే అబద్ధం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 295వ రోజున 46వ డివిజన్ కాపువీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి సమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రెండేళ్ళ క్రితం పత్రికల్లో మొదటి పేజీలలో ఆకర్షణీయంగా వేసిన జాబ్ క్యాలండర్ తరహాలోనే ప్రస్తుతం ప్రకటించిన 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. ఆనాడు ప్రకటించిన జాబ్ క్యాలండర్లో ఏ ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదని, ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ వేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట మడమ తిప్పి పోయిందని, అదే తరహాలో ఇంక ఎన్నికలకు ఏడాది కాలం ఉందనగా ప్రకటించిన 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ గాలి మూటలే అని అన్నారు. ఎన్నికల ఏడాదిలో ఏమైనా ప్రకటిస్తే అదంతా డ్రామానే అని గతంలో ప్రకటించిన సీఎం జగన్ రెడ్డి గారు మరి ఈ డ్రామాల గురించి ఏమి చెప్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అమాయకులుగా భావించి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, ప్రజలేమంత అమాయకులు కారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way