అన్నమయ్య డ్యామ్ వరద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు మలిశెట్టి వెంకట రమణ

మలిశెట్టి వెంకట రమణ

           రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చెయ్యేరు వరద బాధితునికి రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ ఆర్థిక సహకారంతో జనసేన ప్రతినిధులు, చెయ్యేరు వరద బాధిత కుటుంబానికి పోషణ కోసం 20 వేల రూపాయలు, ఇంటి నిర్మాణం 75 వేలు అందజేశారు. ఈ సందర్భంగా..2021 సెప్టెంబర్ నెలలో చెయ్యేరుకు వరద పోటెత్తడంతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. పరివాహక ప్రాంతాలు, అపార ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఇందులో శివారెడ్డి అనే బాధితుడు ఇండ్లు, పశువులు, భూమి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాడు. కొడుకు, కూతురుతో కలిసి చిన్న తాత్కాలిక ప్లాస్టిక్ పట్టల ఇంటిలో జీవనం గడిపేవాడు. అధికార పార్టీ నేతలను,అ ధికారులను అందరిని కలిసినా ఎవరూ సహాయం చేయక పోవడంతో రాజంపేట జనసేన ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ నేనున్నాను అనే భరోసా వచ్చి సహాయం అందించారు. ఇందులో భాగంగా కుటుంబ పోషణ కోసం గతంలో 25 వేల రూపాయలు ఇవ్వగా, ఇంటి నిర్మాణం కోసం 75 వేలు బుధవారం మలిశెట్టి వెంకట రమణ రాయల్ ప్రతినిధులు అందజేశారు. గతంలో 25 వేలు మరోసారి 75 వేలు ఆర్థిక సహాయం ఇవ్వడంపై బాధిత కుటుంబం హర్షం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయ కులు భాస్కర పంతులు, చెక్ డ్యామ్ వెంకటయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way