Search
Close this search box.
Search
Close this search box.

ప్రతి కార్యకర్తకి అండగా నిలుస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 287వ రోజున 46వ డివిజన్ కాకర్ల వారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నూతనంగా తీసుకోవడానికి, రెన్యూవల్ చేసుకోవడానికి గడువు ముగుస్తోందని, ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వాలంటీరుకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏ ఒక్క కార్యకర్తని కూడా విస్మరించమని, రాత్రి పగలు తేడా లేకుండా వారికి ఏ సమయంలో ఏ అవసరం పడినా తోడుగా ఉంటూ అండగా నిలుస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా చేసుకొనే మన యజ్ఞానికి ప్రజలందరి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయని, రాష్ట్రానికి కాబోయే సీఎం పవనన్నే అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way