వైసీపీ ప్రభుత్వంలో కుదేలైన చిరు వ్యాపారస్తులు

– పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 281వ రోజున 47వ డివిజన్ కామాటి వీధిలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల పాటు కోవిడ్ ఇబ్బందులు తదనంతర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహకాలు, సాయం లేకపోవడంతో చిరు వ్యాపారస్తులు అనేకమంది కుదేలయ్యారని అన్నారు. ఏ ఒక్కరిని పలుకరించినా అప్పుల బాధలు చెప్తున్నారని అన్నారు. కొందరికి బ్యాంకుల్లో అప్పుల కోసం ఐటీ దాఖలు చేసినట్లు చూపితే, దాన్ని సాకుగా చూపి రేషన్ కార్డులు రద్దు చేసి సంక్షేమ పథకాలు కూడా రాకుండా చేసారని అన్నారు. ప్రజలను అన్ని రకాలుగా మానసిక వేదనలకు గురిచేస్తున్న ప్రభుత్వం ఇది అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకునే షణ్ముఖ వ్యూహాన్ని రూపొందించారని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way