Search
Close this search box.
Search
Close this search box.

పవనన్న ప్రభుత్వంలో స్వర్ణకారుల కుటుంబాలను ఆదుకుంటాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

          నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 275వ రోజున 47వ డివిజన్ సంతపేటలోని గుప్తా పార్క్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్వర్ణకారుల కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్నారని, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ స్వర్ణకారుల సమస్యలు తీరడం లేదని, బంగారు పని చేసుకునే వారికి ఏమి బాధలు ఉంటాయిలే అని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. దేశంలో ముంబై మహానగరం తర్వాత ఎక్కువ స్థాయిలో స్వర్ణకార కార్మికులు నివసించే ప్రాంతం మన నెల్లూరు నగరం అని, ఇక్కడ పని చేసే కార్మికుల సమస్యలు తనకు అణువణువునా తెలుసని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో రాబోయేది పవనన్న ప్రభుత్వమే అని, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇక్కడి సమస్యలన్నీ తీసుకెళ్ళి స్వర్ణకారుల కుటుంబాలను ఆదుకుంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way