“ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” : మనుబోలు గణపతి

జనసేన

             సర్వేపల్లి ( జనస్వరం ) : “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” కార్యక్రమం 31వ రోజు కార్యక్రమం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం,ముత్తుకూరు మండలం, దువ్వూరి వారి పాలెం గ్రామంలో జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని,దువ్వూరి వారి పాలెం గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మాట్లాడుతూ మా గిరిజననుల ఇళ్ల పరిస్థితి చూడండి. మా బాధలు పట్టించుక్కునే వారే లేరు.వీధి కుళాయి నీళ్లు ఇళ్ల వాకిలి అంతా చేరిపోయింది. స్థానిక నాయకులకు చెప్పిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వేళ వచ్చి ఓటు అడుగుతారు కానీ సామాన్యుల బాధలు ఈ వైసీపీ ప్రభుత్వానికి పట్టదు అంటూ వారి ఆవేదనని వ్యక్తం చేశారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ ఈ పరిస్థితులు మారాలనే,సామాన్యుడికి న్యాయం జరగాలనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. వ్యవస్థలో మార్పు కోసం,అంబేద్కర్ ఆశయాల సాధన కోసం, నగదు రహిత రాజకీయం చేస్తున్నాడు. రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు అయినా “గాజుగ్లాసు” కు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేసుకుందాం, సుసంపన్న పాలన అందిస్తాడు అని తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పోలూరు పెంచల నరసింహా, నాగవేటి రమేష్, తాండ్ర శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way