క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగం మండల జనసేన నాయకులు

     ఆత్మకూరు, (జనస్వరం) :  జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేనపార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనసేనపార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలంలోని బంగ్లా సెంటర్లో (తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా) క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను, వీర మహిళలను, జనసైనికులను దృష్టిలో పెట్టుకొని క్రియాశీలక సభ్యత్వం అనేది పెట్టడం జరిగినది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి జీవిత బీమా 5,00,000/- ; యాక్సిడెంట్ బీమా 50,000/- ; అందచేయడం జరుగుతుంది. ఏ పార్టీ చేయని విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు, కార్యకర్తల, వీర మహిళలు, జనసైనికులుకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్  ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టడం జరిగినది. ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని సంగం మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ సభ్యత్వాన్ని తప్పనిసరిగా తీసుకునే విధంగా కృషి చేస్తామని జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంగం మండల కార్యదర్శి హజరత్, సంగం మండల కార్యదర్శి గురువరాజు, సంగం మండల నాయకులు కృష్ణమోహన్, వెంకటేష్, రంతుల్లా, శ్రీను, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way