Search
Close this search box.
Search
Close this search box.

పింఛన్ ఇవ్వాల్సి వస్తుందని దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు ఇవ్వట్లేదు

– పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 268వ రోజున 54వ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పలువురు దివ్యాంగులు పింఛన్ అందట్లేదనే అంశం తెలిసిందని, వార్డు సచివాలయాల్లో సంప్రదిస్తే దివ్యాంగుల గుర్తింపు సదరం ధ్రువపత్రాలను తెమ్మంటున్నారని కానీ వారు ఎన్నో వ్యయప్రయాసలను ఓర్చుకుని వైద్య కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ధ్రువపత్రాలను ఇవ్వడం లేదని, కేవలం పింఛన్లు ఇవ్వాల్సి వస్తుందనే కారణం చేతే ప్రభుత్వం ఇలా చేస్తోందని దుయ్యబట్టారు. దివ్యాంగుల ఉసురు కూడా ఈ ప్రభుత్వం పోసుకుంటోందని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం దిక్కుతోచని స్థితిలో ఉందనేందుకు ఈ అంశం ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రం గాడిలో పడాలంటే పవనన్న రావాలని, ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way